తెలంగాణ

telangana

పోలీస్ ఉద్యోగం వచ్చింది..మృత్యువు వెంటాడింది..

By

Published : Dec 18, 2019, 9:11 AM IST

ఆ ఇద్దరూ కొద్ది రోజుల్లో పోలీసు ఉద్యోగాల్లో చేరాల్సి ఉంది. కానీ..రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. సూర్యాపేట జిల్లా తాల్లసింగారం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు విగతజీవులుగా మారారు.

road-accident-in-suryapet-district
రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

పోలీస్​ ఉద్యోగం వచ్చిందని ఎంతో మురిసిపోయారు. మరికొద్ది రోజుల్లో శిక్షణకు వెళ్లాలని అన్నీ సిద్దపర్చుకున్నారు. కానీ అనుకోకుండా వారిని రోడ్డు ప్రమాదం కబళించింది. వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. నూతనకల్ మండలం తాల్ల సింగారం గ్రామానికి చెందిన జటంగి నరేష్ , పంతంగి వెంకటేశ్వర్లు అనే ఇద్దరు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

సింగారం గ్రామం నుంచి సూర్యాపేట వైపు ద్విచక్రవాహనంపై వారు వెళ్తుండగా నెమ్మికల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా... మరో యువకుడు జగదీశ్​కి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన జగదీశ్​ని సూర్యపేట ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనదారులు, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా సింగారం గ్రామానికే చెందిన వారు కావడం విస్మయం కలిగిస్తోంది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చూడండి: చటాన్‌పల్లిలో కిడ్నాప్​ అయిన చిన్నారి లభ్యం

ABOUT THE AUTHOR

...view details