తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది' - సూర్యాపేట జిల్లా పోషణ్​ అభియాన్ ప్రాజెక్ట్​ డైరెక్టర్ నరసింహారావు తాజా వార్తలు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంగన్​వాడీ సెంటర్లలో పోషణ్​ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు అంగన్​వాడీ ద్వారా వచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పోషణ్​ అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారావు తెలిపారు.

poshan abhiyan programme at maddiral mandal in suryapeta district
'సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుంది'

By

Published : Sep 29, 2020, 8:09 PM IST

సమతౌల్య ఆహారంతో ఆరోగ్యం సిద్ధిస్తుందని సూర్యాపేట జిల్లా పోషణ్​ అభియాన్ ప్రాజెక్ట్​ డైరెక్టర్ నరసింహారావు అన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ ద్వారా వచ్చే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో అంగన్వాడీ సెంటర్లలో నిర్వహించిన పోషణ్​ అభియాన్ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ చూపొచ్చని తుంగతుర్తి ప్రాజెక్ట్ సీడీపీఓ నాగలక్ష్మి అన్నారు. వారికి ఆకుకూరల ద్వారా పోషకాహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపర్​వైజర్ జీ.లక్ష్మి పుష్ప, చైల్డ్ లైన్ సూర్యాపేట టీం సభ్యులు, హాస్టల్ వార్డెన్లు, అంగన్​వాడీ టీచర్ గురోజు రామ, అంజలి, చిన్నపాక అచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:విషాదాంతం.. ఒంటరితనం తట్టుకోలేక ఆత్మహత్య!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details