సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో పింఛను లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. పింఛను ఇచ్చే సమయంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పింఛన్ లబ్ధిదారుల ధర్నా - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
అధికారులు తమను ఇబ్బందిపెడుతున్నారని పింఛను లబ్ధిదారులు ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మఠంపల్లి మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలని పింఛన్ లబ్ధిదారుల ధర్నా
నెలనెలా.. సమయానికి పింఛన్ ఇవ్వడం లేదని... కనీసం తాగునీటి సదుపాయం కలిగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పింఛన్ లబ్ధిదారుల కోసం పక్కా భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మఠంపల్లి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.