తెలంగాణ

telangana

మఠంపల్లిలో పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం

By

Published : Oct 2, 2019, 4:26 PM IST

హజూర్​నగర్ ఉపఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నేడు మఠంపల్లిలో ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయాలని కోరారు.

మఠంపల్లిలో పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రోజురోజుకు తమకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పద్మావతి తెలిపింది. తెరాస పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తానని... ఇప్పటి వరకు చేయలేదని విమర్శించారు. మాల మహానాడు తెరాస పార్టీకి మద్దతివ్వడమేంటని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ శాసనసభ పక్ష నేతగా ఉన్న భట్టిని తొలగించినప్పటికీ... మాల మహానాడు తెరాసకు ఎలా మద్దతిస్తుందన్నారు.

మఠంపల్లిలో పద్మావతి రెడ్డి ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details