అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా చిలుకూరు ఎంపీడీవో ఈదయ్య వినూత్న ఆలోచన చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ఒక విద్యార్థికి ఒక గంట తన బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా మాధవి అనే విద్యార్థినికి ఒక గంట సేపు ఎంపీడీవోగా బాధ్యతలు అప్పగించారు.
ఒక్కసారిగా తనకు ఇంతటి అవకాశం ఇవ్వడం వల్ల విద్యార్థిని మాధవి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనకు అప్పజెప్పిన బాధ్యతను ఎంతో సమర్ధమంతంగా నిర్వహించింది. గంట సేపు తనలోని నాయకత్వ లక్షణాలను బయటకుతీసి.. పరిపాలనా దక్షత చూపిన తీరుకు మాధవిపై అధికారుల ప్రశంశలు కురిపించారు.