తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతోనే చనిపోయిందనుకొని.. అంత్యక్రియలకు రాని బంధువులు - no one cac attend one women funerals

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. కరోనా కారణంగానే ఆమె మృతి చెంది ఉండవచ్చని స్థానిక ప్రజలు, బంధువులు ఎవరూ ఆమె అంత్యక్రియలకు రాలేరు.

one woman died in huzurnagar
కరోనాతోనే చనిపోయిందనుకొని.. అంత్యక్రియలకు రాని బంధువులు

By

Published : Jul 31, 2020, 3:57 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో రామాలయం గుడి సమీపంలో అనారోగ్యంతో శుక్రవారం ఓ మహిళ మృతి చెందింది. ఆమె చాలా కాలంగా దీర్ఘకాలిక వ్యాధితో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించి శుక్రవారం చనిపోయింది. ప్రస్తుతం హుజూర్​ నగర్​ పట్టణంలో కరోనా విలయతాండవం చేస్తున్నందున... ఆ మహిళ కూడా ఆ కారణంతోనే మృతి చెంది ఉండవచ్చని అనుకున్నారు బంధువులు, స్థానిక ప్రజలు.

మహిళ మృతి చెందినప్పటికీ... కుటుంబ సభ్యులు తప్ప అక్కడకు ఇంకెవరూ వచ్చే సాహసం చేయలేరు. విషయం తెలుసుకున్న మున్సిపల్ సిబ్బంది ముందుకొచ్చారు. వారి సాయంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవీ చూడం ఇవీ చూడండి:ఔరా చిన్నారి: 22 రోజుల్లోనే రామాయణం లిఖించే.!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details