సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం నాగిరెడ్డి గూడెం గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల సమస్యల నిలయంగా మారింది. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు 200కు పైగా ఉన్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం సొంత భవనం కూడా లేక .... అద్దె భవనాల్లో నానా అవస్థలు పడుతున్నారు.
కనీస వసతులు లేవు
విద్యార్థులు చదువుకోడానికి రెండు గదులు మాత్రమే ఉన్నాయి. హాస్టల్లో ఉండటానికి భవనం లేక.. గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయం సరిపోక ఉన్న తరగతి గదుల్లోనే సామాన్లు పెట్టుకుని ఉంటున్నారని తెలిపారు. పాఠశాల ఊరు చివర ఉండటం వలన ప్రహరి గోడ లేకపోవడం వల్ల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు.