తెలంగాణ

telangana

By

Published : Apr 15, 2020, 7:28 PM IST

ETV Bharat / state

'ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడతాం'

కరోనా కట్టడికి రాష్ట్ర సర్కార్ విధించిన లాక్​డౌన్​ నిబంధనలు పాటించకుండా పలుచోట్ల ప్రజలు రహదారులపైకి వస్తున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన పలువురు వాహనదారులతో పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు.

nadiguda si make vehiclers make romise not to go out in suryapet district
ఇంట్లోనే ఉండి కరోనాను తరిమికొడతాం

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల పోలీస్​ స్టేషన్​ పరిధిలో లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు నిలువరించారు. కారణం లేకుండా రహదారులపైకి వచ్చిన పలువురు వాహనదారులతో నడిగూడ ఎస్సై నరేశ్​ ప్రతిజ్ఞ చేయించారు.

అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వస్తామని, ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అడ్డుకుంటామని చోదకులు ప్రతిజ్ఞ చేశారు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై నరేశ్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details