సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఇలియాజ్ గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే పేదరికంలో మగ్గుతున్న ఆ కుటుంబానికి అంత డబ్బు పెట్టి వైద్యం చేయించే స్తోమత లేదు.
ఇలియాజ్ విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు.. మానవత్వంతో ముందుకొచ్చారు. చికిత్స నిమిత్తం రూ.1,56,000 బాధిత కుటుంబానికి అందజేశారు. ఆపత్కాలంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు.