ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ముఖ్యమైన ఆర్థిక కేంద్రమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరమని తెలిపారు. హైదరాబాద్- విజయవాడ మధ్య హైస్పీడ్ రైలు రావాలని ఆయన ఆకాంక్షించారు. రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలు కోసం తమవంతు కృషిచేస్తామని.. రైలు వస్తే హైవే వెంబడి అభివృద్ధి జరుగుతుందని అభిలషించారు. సోమవారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఆర్డీవో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పురపాలక కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి..