తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా కట్టడిలో ప్రభుత్వానికి సహకరించండి' - minister jagadish visited containment areas in suryapet

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలాల్లోని కంటైన్మెంట్​ జోన్లలో మంత్రి జగదీశ్​ రెడ్డి పర్యటించారు. ప్రతిరోజు రసాయన ద్రావణం పిచికారీ చేయించాలని అధికారులకు సూచించారు.

minister jagadish reddy visited containment areas in suryapet
తిరుమలగిరిలో మంత్రి జగదీశ్​ పర్యటన

By

Published : Apr 27, 2020, 9:39 PM IST

కంటైన్మెంట్​ జోన్లలో ఉన్న ప్రజలు బయటకు రాకూడదని మంత్రి జగదీశ్​ రెడ్డి సూచించారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలాల్లోని కంటైన్మెంట్​ జోన్లలో ఎమ్మెల్యే గాదరి కిశోర్​తో కలిసి పర్యటించారు.

కంటైన్మెంట్​ జోన్లలో ప్రతిరోజు రసాయన ద్రావణాలు పిచికారీ చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్వారంటైన్​లో ఉన్న వారికి వైద్య సిబ్బంది ప్రతిరోజు జనరల్​ చెకప్​లు చేస్తున్నారో లేదో ఆరా తీశారు.

అనంతరం లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సరుకులు అందజేశారు. ప్రజలంతా లాక్​డౌన్​ నిబంధలను కచ్చితంగా పాటించాలని మంత్రి జగదీశ్​ రెడ్డి కోరారు. కరోనాను తరిమి కొట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details