సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీకంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్ పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి' - విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండలం డి.కొత్తపల్లిలో శ్రీ కంఠమహేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే పాల్గొన్నారు.
!['అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి' 'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9514738-588-9514738-1605102263555.jpg)
'అందరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి'
కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్ పోతరాజు రజిని, మండల తెరాస అధ్యక్షుడు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ గుండగాని అంబయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:ధాన్యం అమ్ముకునేందుకు టోకెన్లు.. వాటి కోసం క్యూ లైన్లు