తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2020, 8:04 PM IST

ETV Bharat / state

'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్​'

సూర్యాపేట జిల్లా కోదాడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జగదీశ్​రెడ్డి హాజరయ్యారు. మొత్తం బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి వివరించారు.

'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్​'
'బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్​'


సూర్యాపేట జిల్లా కోదాడలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. వ్యవసాయ కమీటీ ఛైర్​పర్సన్​గా బుర్ర సుధారాణి నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్​ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేశారు.

వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్​కు దక్కిందని మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో 65 శాతం వ్యవసాయనికే కేటాయిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి మార్కెట్ వరకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ తెరాస కార్యకర్తలతో ఎడ్లబండితో ర్యాలీ నిర్వహించారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తుకు నాంది: కిషన్​రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details