తెలంగాణ

telangana

ETV Bharat / state

సంతోష్​బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: జగదీశ్​రెడ్డి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో కర్నల్ సంతోష్​బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి.. ఓ కూడలికి సంతోష్​బాబు నామకరణం చేయనున్నట్లు మంత్రి జగదీశ్​రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.

By

Published : Jun 22, 2020, 6:03 PM IST

Minister jagadheesh reddy on colonel santhosh babu family
సంతోష్​బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: జగదీశ్​రెడ్డి

సంతోష్‌బాబు కుటుంబసభ్యులకు అండగా ఉంటామన్నారు మంత్రి జగదీశ్‌రెడ్డి. సంతోష్‌బాబు భార్య సంతోషికి గ్రూప్-1 స్థాయి అధికారిణిగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్... నియామక ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. సంతోష్‌బాబు కుటుంబసభ్యుల కోరిక మేరకు హైదరాబాద్‌లోనే ఇంటి స్థలం కేటాయించిట్లు పేర్కొన్నారు.

సూర్యాపేటలో కర్నల్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విగ్రహం ఏర్పాటు చేశాక సంతోష్‌బాబు కూడలిగా నామకరణం చేస్తామన్నారు. అతి త్వరలోనే కర్నల్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. సంతోష్ బాబు కుటుంబానికి ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని మంత్రి భరోసానిచ్చారు.

సంతోష్​బాబు కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం: జగదీశ్​రెడ్డి

ఇవీ చూడండి:కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details