తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా యోధులను సన్మానించిన ఎమ్మెల్యే

కరోనాను కట్టడి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందిని అందరూ గౌరవించాలని సూచించారు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు.

By

Published : May 14, 2020, 12:30 PM IST

kodhada mla honored sanitation and health department employees
కరోనా యోధులను సన్మానించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని 26 గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందికి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్​ నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం పులమాలలతో సన్మానించారు.

కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న సిబ్బందిని అందరూ గౌరవించాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతీ పౌరుడు బాధ్యతగా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. సంక్షోభంలో కూడా సంక్షేమ కార్యక్రమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందని కొనియాడారు.

ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'

ABOUT THE AUTHOR

...view details