కోదాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
ఎన్టీఆర్ జయంతిని తెదేపా కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి
సూర్యాపేట జిల్లా కోదాడలో ఎన్టీఆర్ జయంతిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం అనే నినాదాలతో ఆప్రాంతమంతా మార్మోగింది. మహిళా రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు ఎన్టీఆరే అని కోదాడ తెదేపా అధ్యక్షుడు ఒరుగంటి ప్రభాకర్ వెల్లడించారు.