తెలంగాణ

telangana

ETV Bharat / state

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

సూర్యాపేట జిల్లా లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్​ ట్యాంకులను భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ పరిశీలించారు. నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని సూచించారు.

By

Published : Aug 21, 2019, 11:35 AM IST

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

ప్రజలంతా నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాలు పెంచాలని భారతీయ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఆశిష్​కుమార్ విజ్ఞప్తి చేశారు. తీవ్ర ఎద్దడి ఉన్న ప్రాంతాలను పరిశీలించే కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నాగారం మండలంలోని లక్ష్మాపురంలో పెరిక్యూలేషన్​ ట్యాంకులను ఆయన పరిశీలించారు. బోరుబావుల తవ్వకాలను తగ్గించి.. చెరువులు, కుంటలు ఏర్పరచుకోవాలని ఆయన తెలిపారు. గుట్టల కింద పెరిక్యూలేషన్​ ట్యాంకులు నిర్మించుకోమని రైతులకు సూచించారు.

'భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలి'

ABOUT THE AUTHOR

...view details