తెలంగాణ

telangana

ETV Bharat / state

వలస కార్మికులకు ఎమ్మెల్యే సాంత్వన - Huzurnagr Mla Saidhi reddy Helps Migrant labours

లాక్​డౌన్​ కారణంగా తమ సొంతూళ్లకు పయనమైన ఒడిశా రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను మార్గమధ్యలో హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి చూశారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారి బాగోగులు.. కుటుంబాల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

వలస కార్మికులకు ఎమ్మెల్యే సాంత్వన
Huzurnagr Mla Saidhi reddy Helps Migrant labours in Suryapeta district

By

Published : May 13, 2020, 12:18 PM IST

వాళ్లంతా పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వలసొచ్చిన కార్మికులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్‌డౌన్ విధించడం వల్ల చేతికి పనిలేక.. చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడిపోతున్నారు. దీనివల్ల హైదరాబాద్​ నుంచి ఒడిశాకు పయనమైన వలస కార్మికులు సూర్యాపేట జిల్లా నెరేడుచర్లకు చేరుకున్నారు.

రహదారి వెంట చిన్న పిల్లలతో నడిచి వెళ్లడాన్ని చూసిన హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి కోదాడ వరకు వాహనంలో పంపించారు. అక్కడి నుంచి వారికి పాసులు ఇప్పించి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు. దీనివల్ల వలస కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details