తెలంగాణ

telangana

ETV Bharat / state

'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు' - huzurnagar trs candidate saidireddi election campaign at huzurnagar constituency

శాసనసభకు పంపిస్తారన్న నమ్మకంతో నోటిఫికేషన్ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారని హుజూర్​నగర్​ శాసనసభ తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు.

'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు'

By

Published : Sep 22, 2019, 7:31 PM IST

'అసెంబ్లీకి పంపిస్తారనే నన్ను ఎంపిక చేశారు'

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం చిల్లపల్లి టోల్​గేట్​ వద్ద ​తెరాస అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అక్కడినుంచి హుజూర్​నగర్​ వరకు బైక్​ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీకి పంపిస్తారన్న నమ్మకంతోనే నోటిఫికేషన్​ వచ్చిన ఐదు నిమిషాలకే ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అభ్యర్థిగా ప్రకటించారన్నారు. తనపై నమ్మకముంచిన కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్​ ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డికి.. భార్యకు పదవి అందించడంపై ఉన్న దృష్టి నియోజకవర్గం అభివృద్ధి మీద లేదని ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్ ఉపఎన్నికల్లో గెలుపు తెరాసదేనని ధీమా వ్యక్తం చేశారు.​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details