తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి - huzurnagar mla saidireddy suggest people to maintain cleanlyness

కరోనా మహమ్మారి ఎంతో ప్రమాదకరమైన వైరస్ అని... రాకముందే నివారించాలని హుజూర్​నగర్​ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. జనతా కర్ఫ్యూకు ప్రజలంతా సహకరించాలని కోరారు.

huzurnagar mla saidireddy suggest people to maintain cleanlyness
కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి

By

Published : Mar 20, 2020, 8:25 PM IST

కరోనా వైరస్​ను చాలా సీరియస్​గా తీసుకోవాలని, ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. అభివృద్ధి చెందిన ఇటలీ లాంటి దేశం సైతం వైరస్​ను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతోందని, వైరస్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ఈనెల 22న ప్రభుత్వం పిలుపుమేరకు అంతా జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనా వైరస్​ను అరికట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేతులను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జనతా కర్ఫ్యూ గురించి పదిమందికి ఫోన్ చేసి దీనిలో భాగస్వాములు కావాలని కోరాలన్నారు.

కరోనా ప్రమాదకరమైంది.. రాకముందే మేల్కోవాలి: సైదిరెడ్డి

ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details