సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో తెరాస, భాజపా శ్రేణుల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన సవాలుపై భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి స్పందించారు. తెరాస చేసిన అభివృద్ధి ఏమీ లేదని... కేంద్రం నిధులతోనే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏమి లేవని విమర్శించారు. పేదలకు ఆరేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు తమ నియోజకవర్గంలో ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. సైదిరెడ్డి పాలనపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై తాము విడుదల చేస్తామని అన్నారు.
'మేము శ్వేత పత్రం విడుదల చేస్తాం... మీరు చేస్తారా?' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు
హుజూర్నగర్లో తెరాస, భాజపా శ్రేణుల నడుమ వాగ్వాదం జరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి విసిరిన సవాలుపై భాజపా జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి స్పందించారు. తెరాస చేసిన అభివృద్ధి ఏమీ లేదని... కేంద్రం నిధులతోనే గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారని ఆరోపించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

'మేము శ్వేత పత్రం విడుదల చేస్తాం... మీరు చేస్తారా?'
హుజూర్నగర్ ఉప ఎన్నికలో తెరాస గెలిచి అభివృద్ధి చేసింది ఏమి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలపై స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. ఒక్క ఏడాదిలోనే రూ.200 కోట్ల పనులు చేశామని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కూర్చొని తేల్చుకుందాం అని బండి సంజయ్కు సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:వలిగొండ మూసీ వాగులో గుర్తు తెలియని మృతదేహం