తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలువలో పడి బాలిక గల్లంతు - missing in sagar canal

సూర్యాపేట జిల్లా మర్రికుంటలో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు సాగర్​ కాలువలో పడి బాలిక గల్లంతైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో పడి బాలిక గల్లంతు

By

Published : Sep 16, 2019, 5:07 PM IST

ప్రమాదవశాత్తు సాగర్​ కాలువలో పడి బాలిక గల్లంతైన ఘటన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం మర్రికుంటలో జరిగింది. ధరావత్ శిరీష స్థానిక సెయింట్ జోసఫ్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా కాలువలో పడిపోయింది. స్థానిక ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాలువలో పడి బాలిక గల్లంతు

ABOUT THE AUTHOR

...view details