కార్యాలయాల చుట్టూ.. కాళ్లరిగేలా తిరిగినా.. తన పనికావడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కళ్లెం చెర్ల నాగయ్యకు 48వ సర్వేనెంబర్లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గుంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ..ఎమ్మార్వో మాత్రం రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం - తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యయత్నం
తన పేరు మీద ఉన్న భూమిని కొత్త రికార్డుల్లో నమోదు చేయాలని ఎమ్మార్వోను వేడుకున్నాడు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరకు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
![తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3725517--thumbnail-3x2-sucide.jpg)
రైతు ఆత్మహత్యయత్నం
రైతు ఆత్మహత్యయత్నం
ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు