తెలంగాణ

telangana

ETV Bharat / state

మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం

కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి మృతుడి స్నేహితులు అండగా నిలిచారు. నగదు సాయంతో పాటు మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

By

Published : Jun 13, 2021, 2:00 PM IST

financial assistance
financial assistance

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెళ్లి గ్రామానికి చెందిన మల్సూర్ ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందాడు. బాల్యంలో అతనితో కలిసి చదువుకున్న పదోతరగతి మిత్రులు.. స్నేహితుడి కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ బృందంగా ఏర్పడి.. స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా సమకూర్చిన రూ. 43,200లను మృతుడి భార్యా పిల్లలకు అందజేశారు.

నగదు సాయంతో పాటు స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:Rape: కదిలే బస్సులో బాలికపై అత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details