సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెళ్లి గ్రామానికి చెందిన మల్సూర్ ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందాడు. బాల్యంలో అతనితో కలిసి చదువుకున్న పదోతరగతి మిత్రులు.. స్నేహితుడి కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఓ బృందంగా ఏర్పడి.. స్నేహితులు, బంధుమిత్రుల ద్వారా సమకూర్చిన రూ. 43,200లను మృతుడి భార్యా పిల్లలకు అందజేశారు.
మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి ఆపన్నహస్తం
కరోనాతో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి మృతుడి స్నేహితులు అండగా నిలిచారు. నగదు సాయంతో పాటు మిత్రుడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
financial assistance
నగదు సాయంతో పాటు స్నేహితుడి కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:Rape: కదిలే బస్సులో బాలికపై అత్యాచారం!