తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం తరలిస్తున్న రైతు జారిపడి మృతి - ధాన్యం తరలిస్తున్న రైతు జారిపడి మృతి...

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయ కేంద్రానికి తరలిస్తున్న రైతును గతుకుల రోడ్డు బలితీసుకుంది. ట్రాక్టర్​లో ధాన్యం బస్తాలు తీసుకెళ్తూ ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయాడు.

FARMER DIED IN ACCIDENT AT RAVULAPALLY
FARMER DIED IN ACCIDENT AT RAVULAPALLY

By

Published : Dec 10, 2019, 9:30 PM IST

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి సమీపంలో దారుణం చోటుచేసుకుంది. మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోనికి చెందిన వెంకన్న(55) తిరుమలగిరి వ్యవసాయమార్కెట్​కు ధాన్యం తీసుకెళ్తున్నాడు. గతుకుల రోడ్డు కావటం వల్ల ట్రాక్టరులో ధాన్యం బస్తాల మీద కూర్చున్న వెంకన్న జారి పడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వెంకన్నను సూర్యాపేట ఏరియా హాస్పిటల్​కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలోనే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ధాన్యం తరలిస్తున్న రైతు జారిపడి మృతి...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details