తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2020, 11:38 PM IST

ETV Bharat / state

సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూకంపం.. భయాందోళనలో జనం..

తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇటీవల భూకంపం సంభవించగా.. తాజాగా ఈరోజు సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పాత వెల్లటూర్ గ్రామ సమీపంలో పలుచోట్ల భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. 10 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు సార్లు కంపించిందని తెలిపారు.

Earthquake in Suryapet district again today in telangana
సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూకంపం.. భయాందోళనలో జనం..

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో పాత వెల్లటూర్ గ్రామ సమీపంలో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 10 నిమిషాల వ్యవధిలో వరుసగా మూడు సార్లు కంపించిందని అన్నారు.

భూమి కంపించడం వల్ల స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. చింతలపాలెం మండల కేంద్రంలో సుమారు నెల రోజుల నుంచి వస్తున్న భూకంపానికి ఇళ్ల గోడలు పగుళ్లు వచ్చినట్టు స్థానికులు వెల్లడించారు. సుమారు నాలుగు సెకన్లు కంపించిందన్నారు. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1 గా నమోదైందని సమాచారం.

సూర్యాపేట జిల్లాలో మళ్లీ భూకంపం.. భయాందోళనలో జనం..

ఇదీ చూడండి :స్టూడెంట్​ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్

ABOUT THE AUTHOR

...view details