తెలంగాణ

telangana

ETV Bharat / state

సంక్షేమ పథకాలు వేగంగా అమలు చేయాలి: మంత్రి - minister jagdeesh reddy latet news

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, నల్గొండ ఎంపీ, దిశ కమిటీ ఛైర్మన్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అధికారులకు సూచించారు. సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశంలో వీరు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలు వేగంగా అమలు చేయాలి: మంత్రి
సంక్షేమ పథకాలు వేగంగా అమలు చేయాలి: మంత్రి

By

Published : Sep 13, 2020, 12:35 PM IST

సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. సమావేశంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, నల్గొండ ఎంపీ, దిశ కమిటీ ఛైర్మన్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజారాణి పాల్గొన్నారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి, విద్యుత్, మున్సిపాలిటీ, వ్యవసాయ, ఉద్యానవన, వైద్యశాఖ, మహిళా శిశు సంక్షేమ, సివిల్ సప్లై, రెవెన్యూ, జిల్లా పరిశ్రమల శాఖపై సమీక్షించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని 475 గ్రామ పంచాయతీల్లో 2, 69, 508 కుటుంబాలకు జాబ్ కార్డులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

ఉపాధి హామీ పథకం కింద 474 స్మశాన వాటికలు మంజూరు కాగా ఇప్పటివరకు 56 పూర్తి అయినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా జిల్లాకు 70064 మరుగుదొడ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 65343 పూర్తైనట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:జేఈఈ మెయిన్స్‌లో గురుకులాల విద్యార్థుల ప్రతిభ

ABOUT THE AUTHOR

...view details