సూర్యాపేటలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పర్యటించారు. సూర్యాపేటలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎస్ వెల్లడించారు. జిల్లాలో కరోనా వ్యాప్తి పెరగడానికి గల కారణాలపై సమీక్ష నిర్వహించినట్లు చెప్పారు. వైరస్ నియంత్రణ చర్యల కోసం ప్రత్యేక అధికారుల బృందాన్ని నియమించామన్నారు. కంటైన్మెంట్ జోన్లో ప్రజల కదలికలను లేకుండా చూడాలని చెప్పామని పేర్కొన్నారు.
సూర్యాపేటలో 83కు చేరిన కరోనా కేసులు - corona virus suryapeta
సూర్యాపేటలో మొత్తం 83 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సూర్యాపేటలోని కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
![సూర్యాపేటలో 83కు చేరిన కరోనా కేసులు cs somesh kumar review on corona in suryapeta district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6892706-thumbnail-3x2-cs.jpg)
సూర్యాపేటలో 83కు చేరిన కరోనా కేసులు