తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇందిరాగాంధీ విగ్రహం తొలగింపుపై కాంగ్రెస్​ ధర్నా - Telangana News Updates

సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మఠంపల్లిలోని ఇందిరాగాంధీ విగ్రహం తొలగింపుపై ఆగ్రహం చెందారు.

Congress leaders
Congress leaders

By

Published : Apr 26, 2021, 1:57 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రం ప్రధాన రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. మెయిన్ రోడ్డు పక్కన ఉన్న ఇందిరా గాంధీ విగ్రహం తొలగించడం వల్ల గొడవ మొదలైంది. రోడ్డు నిర్మాణం పేరిట కనీస సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీకి చెందిన సర్పంచ్​... ఇందిరాగాంధీ విగ్రహాన్ని తొలగించారని కాంగ్రెస్​ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. దీనితో భారీగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details