తెలంగాణ

telangana

ETV Bharat / state

'పేదల కరెంట్​ బిల్లులను మాఫీ చేయాలి' - కాంగ్రెస్​ నేతల నిరసన

లాక్​డౌన్​ సమయంలో ఆర్థికంగా నష్టపోయిన నిరుపేద ప్రజలపై రాష్ట్రప్రభుత్వం విద్యుత్తు బిల్లుల భారం మోపడం సరికాదని సూర్యాపేటలో కాంగ్రెస్​ నాయకులు ధర్నా నిర్వహించారు. పెంచిన కరెంట్​ బిల్లులను తక్షణమే మాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.

Congress leaders held Strike in Suryapeta demanding the reducing current bills for poor peolples
పేదల కరెంట్​ బిల్లుల మాఫీ చేయాలి

By

Published : Jul 6, 2020, 4:24 PM IST

కరోనా కాలంలో అధికంగా వసూలు చేసిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట డీఈ కార్యాలయం ముందు కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. పీసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల జెండాలు ధరించి నిరసన తెలిపారు.

పెంచిన విద్యుత్తు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో నిరుపేద కుటుంబాలకు విద్యుత్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details