సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలనుసారం తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసు, రవాణా, వైద్య, రెవిన్యూ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేవారిని గుర్తించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులకు కొవిడ్-19 వైరస్ నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తున్నారు.
కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: కోదాడ రూరల్ సీఐ - కరోనా వైరస్
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలోని విదేశీయుల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నందున జిల్లా సరిహద్దులో తనఖీలు నిర్వహిస్తున్నారు.

కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: కోదాడ రూరల్ సీఐ
రామాపురం క్రాస్ రోడ్డు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం అయినందున అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ రోజు నుంచి ఏపీ నుంచి వచ్చే ప్రయాణికులకూ పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. కరోనా వైరస్ పై ప్రజలు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని... తగిన జాగ్రత్తలతో కొవిడ్-19ను నివారించవచ్చని కోదాడ రూరల్ సీఐ శివరాం రెడ్డి తెలిపారు.
కరోనా నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత: కోదాడ రూరల్ సీఐ
TAGGED:
corona update news