తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్​లో నిజామాబాద్ తరహా​ ఫలితమే.. : లక్ష్మణ్​ - BJP STATE PRESIDENT LAXMAN ON RTC STRIKE

హుజూర్​నగర్​ ప్రజలు స్పష్టమైన మార్పుకోరుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ తెలిపారు. కాంగ్రెస్​, తెరాస పాలనతో ఓటర్లు విసిగిపోయారని విమర్శించారు.

నిజామాబాద్​ ఫలితాలే హుజూర్​నగర్​లోనూ..: లక్ష్మణ్​

By

Published : Oct 15, 2019, 5:37 PM IST

ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కితవారి గూడెంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పర్యటించారు. భాజపా అభ్యర్థి రామారావును గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్మికులను, ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తూ, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని ఆరోపించారు. కేంద్రం సైతం ఇక్కడ జరిగే పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తోందని తెలిపారు. నిజామాబాద్ లోక్​సభ​ ఫలితాలే.. హుజూర్​నగర్​లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​, తెరాస పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. నిజామాబాద్​లో రైతులు ప్రభుత్వానికి బుద్ధిచెబితే.. హుజూర్​నగర్​లో సర్పంచులు గుణపాఠం చెబుతారని లక్ష్మణ్​ అన్నారు.

నిజామాబాద్​ ఫలితాలే హుజూర్​నగర్​లోనూ..: లక్ష్మణ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details