తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు ఆర్జించాలి'

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జలశక్తి అభియాన్ నీటి సంరక్షణ ప్రాచుర్య కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. రైతులు ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు.

By

Published : Feb 21, 2020, 12:09 AM IST

awarness progrmm for farmers on water managment
'ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు ఆర్జించాలి'

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శ్రీ అరవింద కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో... జలశక్తి అభియాన్​ నీటి సంరక్షణ ప్రాచుర్య కార్యక్రమం నిర్వహించారు. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయం చేసి బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయాలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.

రైతులకు మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. అంతర, బింధు, తుంపర సేద్యంతో రైతులు అధిక లాభాలు ఆర్జించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్​ కుమార్​, అధికారులు పాల్గొన్నారు.

'ఆధునిక వ్యవసాయంతో అధిక లాభాలు ఆర్జించాలి'

ఇవీ చూడండి:బాలికలను వేధిస్తే ఎవరైనా ఒకటే: మంత్రి కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details