తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2019, 8:51 PM IST

ETV Bharat / state

హుజూర్​నగర్​లో కేసీఆర్​ సభకు ఏర్పాట్లు

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో రేపు జరగబోయే కృతజ్ఞత సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మంత్రి జగదీష్​ రెడ్డి, ఉప ఎన్నిక ఇన్​ఛార్జి పల్లా రాజేశ్వర్​రెడ్డి సభాస్థలిని పరిశీలించారు.

హుజూర్​నగర్​లో సీఎం కేసీఆర్ సభ

హుజూర్​నగర్​లో సీఎం కేసీఆర్ సభ

హుజూర్​నగర్​ ఉపఎన్నికల్లో తెరాస ఘనవిజయం సాధించినందున కృతజ్ఞత సభ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ భావించారు. రేపు జరగబోయే ఈ సభ ఏర్పాట్లను మంత్రి జగదీష్​ ​రెడ్డి, తెరాస ఉప ఎన్నిక ప్రధాన బాధ్యుడు పల్లా రాజేశ్వర్ ​రెడ్డి పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హుజూర్​నగర్​లో కృతజ్ఞత సభకు సీఎం కేసీఆర్​ హాజరవుతారని మంత్రి జగదీష్​ రెడ్డి తెలిపారు. రోడ్డు మార్గం ద్వారా సభాస్థలిని చేరుకుంటారని వెల్లడించారు. సుమారు లక్ష మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారని వారు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details