తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉరేసుకుని 75 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

సొంతూరుకు వెళ్లలేనేమోనన్న బాధతో 75 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యాపేటకు చెందిన వెంకన్న.. కాచిగూడ రత్న నగర్​లోని తన కుమారుడి నివాసంలో ఉరేసుకున్నాడు. లాక్​డౌన్​ కంటే ముందు ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాననే మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉరేసుకుని 75 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య
ఉరేసుకుని 75 ఏళ్ల వృద్ధుడి ఆత్మహత్య

By

Published : May 13, 2020, 8:23 PM IST

సూర్యాపేటకు చెందిన 75 ఏళ్ల వృద్ధుడు వెంకన్న హైదరాబాద్​ కాచిగూడ రత్న నగర్​లో ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు వీరేశం వద్దకు లాక్​డౌన్​ కంటే ముందు వచ్చి చిక్కుకుపోయాడు. లాక్​డౌన్​ కారణంగా సొంతూరుకు సూర్యాపేటకు వెళ్లలేకపోతున్నానని మనస్తాపం చెందినట్లు కుమారుడు వీరేశం తెలిపాడు. ఒకటి రెండు సార్లు కుమారుడిని, మనవడిని అడిగిన పంపించలేదని.. ఇక వెళ్ళలేనేమో అని బెంగ పెట్టుకొని కుమారుడి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details