Paddy Damage in Suryapet : సూర్యాపేట జిల్లా మునగాలలోని ఓ రైస్ మిల్లులో నిల్వ ఉంచిన ధాన్యం మొలకెత్తింది. వానాకాలం సీజన్లో పలు ఐకేపీ కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్మిల్లు ఆవరణలో ఆరుబయట నిల్వచేశారు. దాదాపు 30వేల క్వింటాళ్ల ధాన్యానికి మొలకలు వచ్చాయి. ఏం చేయాలో పాలుపోని మిల్లు యజమాని అశోక్.. అధికారులకు సమాచారం అందించారు.
Paddy Damage in Munagala : రైస్ మిల్లుకు వచ్చి ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు.. ఆరు బయట నిల్వచేసినందున బీమా వర్తించదని చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. ధాన్యం తడవకుండా పట్టాలు కప్పినా.. ఇటీవల కురిసిన వాన, మంచుకు ధాన్యం మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపు మొలకెత్తిన ధాన్యం ఖరీదు.. 12 కోట్లు ఉంటుందని అన్నారు. ప్రభుత్వం స్పందించి తనకు సాయం చేయాలని వేడుకున్నాడు.