తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​నగర్ బరిలో 251 మంది సర్పంచ్​లు..

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ పెద్దసంఖ్యలో రైతులు నామినేషన్లు దాఖలు చేయడం అప్పట్లో సంచలనమైంది. ఆ పంథాలోనే సర్పంచ్​లు వెళుతున్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో 251 మంది సర్పంచ్​లు నామనేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

By

Published : Sep 26, 2019, 5:00 PM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

హుజూర్ నగర్ ఉప ఎన్నిక... బరిలో 251మంది సర్పంచులు

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ బరిలో తెలంగాణ సర్పంచ్​లు సంఘం అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సౌదని భూమన్న యాదవ్ వెల్లడించారు ఈ నెల 29, 30న 'హలో సర్పంచ్‌.. చలో హుజుర్‌నగర్‌' పేరుతో ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి దిగబోతోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా... ఉప ఎన్నికల బరిలో మొత్తం 251మంది సర్పంచ్​లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉప సర్పంచ్​లకు జాయింట్ చెక్కు పవర్​ను రద్దుచేయాలని...73వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని వెల్లడించారు. 14వ ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను నేరుగా గ్రామపంచాయితీలకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెరాస అభ్యర్థిని ఓడించి సర్పంచుల సత్తా ఏమిటో చూపిస్తామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details