తెలంగాణ

telangana

ETV Bharat / state

మోత్కూర్‌లో 25 మందికి కరోనా వైరస్‌

సూర్యాపేట జిల్లాలో కరోనా విస్తరిస్తోంది. మోత్కూర్‌ మండలంలో 130 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అందరిని హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లు మండల వైద్యాధికారి తెలిపారు.

By

Published : Sep 4, 2020, 11:51 AM IST

coronavirus
coronavirus

సూర్యాపేట జిల్లా మోత్కూర్ పీహెచ్‌సీలో 55 మందికి పరీక్షలు చేయగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధరణ అయింది. పోడిచేడు గ్రామంలో 75 మందికి పరీక్షలు మొబైల్ కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా 12 మందికి పాజిటివ్ వచ్చింది. మండలంలో మొత్తం 130 మంది పరీక్షలు నిర్వహించగా 25 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వీరందరికి ఐసోలేషన్‌ కిట్ అందించి హోం ఐసోలేషన్‌లో ఉంచినట్లుగా పీహెచ్‌సీ వైద్యాధికారి కిషోర్ కుమార్ తెలిపారు.

అడ్డగుడూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 42 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 14 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అందులో (డి)రాపాక గ్రామంలో 12 మందికి, చౌళ్లరామారం గ్రామానికి చెందిన ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యాధికారి డాక్టర్ నరేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details