సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఒకే రోజు 13 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మండలంలోని పీహెచ్సీలో శనివారం 17 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 13 మందికి వైరస్ నిర్ధరణైంది. తొండా గ్రామంలో 2, తాటిపాములలో 5, తిరుమలగిరిలో 6 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మండలంలో 57 యాక్టివ్ కేసులు ఉండగా.. ప్రస్తుతం ఆసంఖ్య 71కి పెరిగింది.
తిరుమలగిరిలో తాజాగా 13 మందికి కరోనా.. మొత్తం 71కి పెరిగిన సంఖ్య - 13 corona positive cases in telangana
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో ఒకే రోజు 13 మందికి కరోనా పాజిటివ్ రాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 71కి పెరిగినట్లు వైద్యాధికారి ప్రశాంత్బాబు వెల్లడించారు. తొండా గ్రామంలో 2, తాటిపాములలో 5, తిరుమలగిరిలో 6 కేసులు నమోదయ్యాయని.. ఆయా గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాలని అధికారులకు సూచించారు.
తిరుమలగిరిలో తాజాగా 13 మందికి కరోనా.. మొత్తం 71కి పెరిగిన సంఖ్య
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోం ఐసోలేషన్ కిట్లను అందించారు. మండలంలో కరోనా కట్టడి కోసం వ్యాపారస్థులు రోజులో కేవలం 8 గంటలు మాత్రమే వ్యాపార లావాదేవీలు జరిపేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కొవిడ్ నియంత్రణకు ప్రజలందరూ జాగ్రత్తలు వహించాలని వైద్యాధికారి ప్రశాంత్ బాబు సూచించారు. వైరస్ సోకిన గ్రామాల్లో హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేయించాలని విజ్ఞప్తి చేశారు. . ప్రజలు బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ధరించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.