తెలంగాణ

telangana

ETV Bharat / state

'పండుగ తర్వాత హజ్ హౌజ్​ను ప్రారంభించుకుందాం'

సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి హరీశ్​రావు, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి  పాల్గొన్నారు. రంజాన్ పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

By

Published : Jun 1, 2019, 12:21 AM IST

ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలి

సిద్దిపేటలో మైనారిటీల అభ్యున్నతికి అధికారకంగా త్వరలోనే హజ్ హౌస్ అందుబాటులోకి రానుందని ఎమ్మెల్యే హరీశ్​రావు తెలిపారు. పట్టణంలోని మదీనా ఫంక్షన్ హాల్​లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారు.

మైనారిటీల కోసం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మంచి విద్యను అందిస్తున్నామన్నారు. హజ్ యాత్రికుల కోసం హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే 2 కోట్ల రూపాయలతో అద్భుతమైన హజ్ హౌస్ నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, కూలర్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.

పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి: హారీశ్

ఇవీ చూడండి : హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details