తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మానాన్న చనిపోయారు.. మాకు దిక్కెవరు? - rajakka peta, Dubbaka

ఈ సమాజంలో బతకాలంటే.. ఎవరో ఒకరి తోడు కావాలి. పిల్లలకైతే.. కచ్చితంగా అమ్మో.. నాన్నో ఉండాల్సిందే. అలాంటిది.. అమ్మానాన్న ఇద్దరూ ఈ లోకాన్ని వదిలేశారు. ఏమీ తెలియని ఇద్దరు పసిపిల్లలను ఈ లోకానికి వదిలేసి వెళ్లిపోయారు. ఏ దిక్కు లేని ఆ పిల్లలు ఓ అండ కోసం ఎదురుచూస్తున్నారు. సాయం కోసం అర్థిస్తున్నారు

two kids orphans
అమ్మానాన్న చనిపోయారు.. మాకు దిక్కెవరు?

By

Published : Feb 17, 2020, 4:51 PM IST

అమ్మానాన్న చనిపోయారు.. మాకు దిక్కెవరు?

భాను.. అభిజ్ఞ.. వీరిది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. ఐదేళ్ల క్రితం.. తండ్రి బొల్లు రాజయ్యని అనారోగ్యం మింగేసింది. కుటుంబానికి పెద్ద దిక్కయిన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుంది రేణుక. కూలీనాలీ చేసి పిల్లలిద్దరినీ చదివిస్తూ.. పోషించుకునేది. కొన్నిరోజుల క్రితం రేణుక ఆరోగ్యం కూడా చెడిపోయింది. మంచానపడి అనారోగ్యంతో చనిపోయింది. తల్లి, తండ్రి ఇద్దరూ.. చనిపోవడంతో.. భాను, అభిజ్ఞలు అనాథలయ్యారు. పిల్లలిద్దరికీ అమ్మమ్మ ఉన్నప్పటికీ.. ఆమెకు వయసైపోయింది. అనారోగ్యంతో బాధపడుతోంది.

సాయం చేసే.. చేతుల కోసం..

పొద్దున్నే లేచి ఇంటి పనులు చేసుకుని బడికి వెళ్తున్న ఆ పిల్లలను చూసి చుట్టుపక్కవారంతా కంటతడి పెట్టుకుంటున్నారు. ఆడుతూ.. పాడుతూ.. తల్లిదండ్రుల ఆలనా.. పాలనలో పెరగాల్సిన పిల్లలిద్దరూ అనాథలుగా మిగిలిపోవడం.. చూసేవారి హృదయాలను కలచివేస్తుంది. తల్లిదండ్రులు లేక.. నా అనే దిక్కు లేక బిక్కటిల్లుతున్నారు. ఆదరించి.. అక్కున చేర్చుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రగతి భవన్​లో మొక్కలు నాటిన కేసీఆర్ కుటుంబసభ్యులు

ABOUT THE AUTHOR

...view details