తెలంగాణ

telangana

ETV Bharat / state

'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'

మున్సిపల్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ గజ్వేల్​లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

By

Published : Jan 16, 2020, 2:21 PM IST

trs pracharam in gajwel
'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో తెరాస ప్రచార పరంపర కొనసాగిస్తోంది. ప్రజలంతా కారు గుర్తుకు ఓటు వేసి తెరాసను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ... 20వ వార్డులో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

'కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు'
గజ్వేల్​ను కేసీఆర్ ఇప్పటికి వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని... ఇటివలే 100 కోట్ల రూపాయలతో మురుగు కాలువ నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. ఎన్నికల కారణంగా పనులు ప్రారంభం కాలేదని... ఎన్నికల అనంతరం అభివృద్ధి పనులు కొనసాగుతాయని వెల్లడించారు. కారు గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రతాప్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details