తెలంగాణ

telangana

ETV Bharat / state

'ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం' - mp banda praakash latest news

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​ రావు చొరవతో ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం కేటాయించామని ఎంపీ బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. ఈ భవనానికి జనవరి 8 న పూజ చేస్తామని ప్రకటించారు. ముదిరాజ్ కులస్థులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

Three acres of land for Mudiraj Welfare Building in siddipet
'ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం మూడు ఎకరాల స్థలం'

By

Published : Dec 26, 2020, 10:09 PM IST

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంక్షేమ భవనం కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్​ రావు చొరవతో మూడు ఎకరాల స్థలం కేటాయించామని ఎంపీ బండ ప్రకాష్ ముదిరాజ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆర్అండ్​బీ గెస్ట్ హౌస్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. త్వరలో నిర్మించబోయే ముదిరాజ్ సంక్షేమ భవనానికి జనవరి 8న భూమి పూజ చేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు మంత్రి హరీశ్​ రావు, ఈటెల రాజేందర్ హాజరవుతారన్నారు. ముదిరాజ్ కులస్థులు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్ సంక్షేమం కోసం ఇప్పటికే చాలా మచ్చ సొసైటీ భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయని గుర్తుచేశారు.

ఇదీ చూడండి:'కొత్త' గుబులు: యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి పాజిటివ్​

ABOUT THE AUTHOR

...view details