తెలంగాణ

telangana

ETV Bharat / state

టీనేజీలో ప్రేమించి.. మేజరయ్యాక వద్దంది.. యువకుని ఆత్మహత్య - సిద్దిపేటలో ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య

నాలుగేల్లుగా ఓ అమ్మాయిని ప్రేమించాడు. తనే సర్వస్వం అనుకున్నాడు. కానీ చివరకు తనను కాదని పొమ్మంది. తట్టుకోలేక ఫ్యాన్​కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట పట్టణంలో చోటుచేసుకుంది.

టీనేజీలో ప్రేమించి.. మేజరయ్యాక వద్దంది.. యువకుని ఆత్మహత్య

By

Published : Nov 7, 2019, 2:54 PM IST

Updated : Nov 7, 2019, 6:09 PM IST

ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. పట్టణంలోని కుశాల్​నగర్​కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మురళి, లతల రెండో కుమారుడు సంతోష్(20) సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల అకస్మాత్తుగా యువతి తన ప్రేమను తిరస్కరించడం వల్ల యువకుడు మనస్తాపం చెందాడు. ప్రేమికురాలు దక్కలేదని బాధతో జీవితంపై నిరాశ చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

సంతోశ్‌ స్నేహితులు ఫోన్‌ ఎత్తడం లేదని ఆ ఇంటి వైపు వెళ్లి చూశారు. మూసి ఉన్న తలుపులను బలవంతంగా తెరిచి చూడగా మృతి చెంది ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి మురళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

టీనేజీలో ప్రేమించి.. మేజరయ్యాక వద్దంది.. యువకుని ఆత్మహత్య

ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్​పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక

Last Updated : Nov 7, 2019, 6:09 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details