ప్రేమ విఫలమై మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. పట్టణంలోని కుశాల్నగర్కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మురళి, లతల రెండో కుమారుడు సంతోష్(20) సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఓ యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల అకస్మాత్తుగా యువతి తన ప్రేమను తిరస్కరించడం వల్ల యువకుడు మనస్తాపం చెందాడు. ప్రేమికురాలు దక్కలేదని బాధతో జీవితంపై నిరాశ చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.