తెలంగాణ

telangana

దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

By

Published : Oct 5, 2020, 10:29 PM IST

Updated : Oct 5, 2020, 11:06 PM IST

దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​
దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

22:27 October 05

దుబ్బాక తెరాస అభ్యర్థిని ఖరారు చేసిన సీఎం కేసీఆర్​

దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికకు అధికార తెరాస పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. తెరాస అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు.  

 సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారని.. ఉద్యమం కోసం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని కేసీఆర్ పేర్కొన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారన్నారు.  రామలింగారెడ్డి కుటుంబమంతా అటు ఉద్యమంలో.. ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ భాగస్వాములయ్యారని కేసీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరితో ఆ కుటుంబానికి అనుబంధం ఉందని సీఎం అన్నారు.  

 రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికి... నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమాలు యథావిధిగా అమలు కావడానికి సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే నియోజకవర్గానికి ప్రాధినిద్యం వహించడం సమంజసమని కేసీఆర్ పేర్కొన్నారు. జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపిన తర్వాతనే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు సీఎం  కేసీఆర్ ప్రకటించారు.

Last Updated : Oct 5, 2020, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details