తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్సాలకు అలవాటుపడి.. ద్విచక్రవాహనాల చోరీ - సిద్దిపేట జిల్లాలో బైక్​ దొంగతనాల వార్తలు

జల్సాలకు అలవాటు పడి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్​లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. పోలీసులకు వారు చిక్కారు.

Siddipeta Police arrested three men for Bike robberies at Gajwel
జల్సాలకు అలవాటుపడి.. బైక్‌ల చోరీ

By

Published : Jun 18, 2020, 8:23 AM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్​లో సీఐ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు అక్కడ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు వారిని విచారించారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్​కు చెందిన మహేష్ గౌడ్, ముప్పుకల్ చెందిన నసీరుద్దీన్, కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఊరే రాజులు ఇటీవలే దొంగతనాలు చేస్తున్నట్టు అంగీకరించారు. నిందితుల నుంచి పది ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని, రిమాండ్ విధించారు.

ABOUT THE AUTHOR

...view details