డిజిటల్ మాధ్యమంలో నూతనంగా అడుగిడిన ఈటీవీ భారత్ యాప్కు తెరాస నేత, సిద్దిపేట ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే విధంగా 13 రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ యాప్ దేశంలో అనతి కాలంలోనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ తమ వార్తల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమించే వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు.
'ఈటీవీ భారత్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి'
సమాచార ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈనాడు కొత్త తరానికి అనుగుణంగా ఈటీవీ భారత్ రూపంలో డిజిటల్ మాధ్యమంలో అడుగిడింది. ఈ యాప్కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఈటీవీ భారత్ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
హరీశ్రావు