తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈటీవీ భారత్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలి'

సమాచార ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈనాడు కొత్త తరానికి అనుగుణంగా ఈటీవీ భారత్​ రూపంలో డిజిటల్​ మాధ్యమంలో అడుగిడింది. ఈ యాప్​కు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు ఈటీవీ భారత్​ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

By

Published : Mar 22, 2019, 3:24 PM IST

హరీశ్​రావు

డిజిటల్​ మాధ్యమంలో నూతనంగా అడుగిడిన ఈటీవీ భారత్​ యాప్​కు తెరాస నేత, సిద్దిపేట ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించే విధంగా 13 రాష్ట్రాల్లో ఒకేసారి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ యాప్​ దేశంలో అనతి కాలంలోనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ తమ వార్తల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రమించే వ్యక్తి రామోజీరావు అని ప్రశంసించారు.

ఈటీవీ భారత్​కు అభినందనలు తెలుపుతున్న హరీశ్​రావు

ABOUT THE AUTHOR

...view details