తెలంగాణ

telangana

ETV Bharat / state

రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నర్సారెడ్డి

అనారోగ్యంతో మరణించిన రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి పరామర్శించారు. రామలింగారెడ్డి మరణం నియోజకవర్గానికి తీరని లోటని ఆయన అన్నారు.

By

Published : Aug 7, 2020, 7:39 PM IST

Siddipet Dcc President thumkunta Narsi Reddy Meets MLA Solipeta Family
http://10.10.50.85:6060/reg-lowres/07-August-2020/tg_srd_46_07_dcc_president_paramarsha_avb_ts10124_hd_720p_0708digital_1596792996_669.mp4

అనారోగ్యంతో మరణించిన శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్​, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని సిద్ధిపేట జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు పరామర్శించారు. దుబ్బాక మండలంలోని ఎమ్మెల్యే స్వగ్రామం చిట్టాపూర్​లో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సోలిపేట మరణం బాధాకరమని.. నిత్యం ప్రజల మధ్యలో ఉండే ఆయన మరణం దుబ్బాక నియోజక వర్గానికి తీరని లోటని అన్నారు.

రామలింగారెడ్డితో తమకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని ఈ సందర్భంగా నర్సారెడ్డి గుర్తు చేసుకున్నారు. సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి పీఏసీఎస్ డైరెక్టర్​ గజభీమ్​కార్ బాలరాజు, ఆస ముత్యం, కమలాకర్, నగరం రవి, ఎల్లం సలీం, ఆకుల భరత్, శ్రీ రాం నరేందర్, రాజిరెడ్డి, మురళి తదితరులు ఉన్నారు.

ఇవీచూడండి:భారత్ బయోటెక్​ ల్యాబ్​ను సందర్శించిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details