తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రైతు! - seeds distributed in husnabad

దేశంలోనే తెలంగాణ రైతులను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాలను రైతులకు అందజేశారు.

seeds distribution to farmers by mla sathish kumar in husnabad
హుస్నాబాద్​లో రైతులకు విత్తనాలు

By

Published : May 11, 2020, 3:52 PM IST

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లోని తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో ప్రభుత్వం రాయితీపై అందిస్తోన్న విత్తనాలను ఎమ్మెల్యే సతీశ్​ కుమార్ రైతులకు అందజేశారు. బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాల మాఫీ విషయంలో కూడా 25 వేల రూపాయల చెక్కులు త్వరలో రాబోతున్నాయని తెలిపారు.

కరోనా లాక్​డౌన్​తో ప్రపంచమంతా స్తంభించిపోయినా తెలంగాణలో మాత్రం రైతులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ ఛైర్​ పర్సన్ ఆకుల రజిత పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details