సిద్దిపేట జిల్లాలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. దుబ్బాక డిపో నుంచి ఉదయం 6 గంటలకే బస్సులు వివిధ రూట్లకు బయల్దేరాయి. లాక్డౌన్ నిబంధనల మేరకు అధికారులు బస్సులను డిపోలోనే శానిటైజ్ చేసి పంపిస్తున్నారు. అలాగే విధులకు హాజరైన కండక్టర్లు,డ్రైవర్లు డిపో సూపర్వైజర్ మాస్కులు పంపిణీ చేశారు.